Army Choppers: రాత్రంతా పోరాడి వరదల్లో చిక్కుకున్న ఏడుగురు రైతులను కాపాడిన ఆర్మీ హెలికాప్టర్లు (video)

సెల్వి
గురువారం, 28 ఆగస్టు 2025 (16:22 IST)
Army Choppers
సిరిసిల్లలో వరదల్లో చిక్కుకున్న ఏడుగురు రైతులను ఆర్మీ హెలికాప్టర్లు కాపాడాయి. గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలోని అప్పర్ మానేరు ప్రాజెక్టు వద్ద రాత్రిపూట జరిగిన ఆపరేషన్ ద్వారా ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో రైతులు  సురక్షితంగా రక్షించబడ్డారు. వరదల్లో చిక్కుకుపోయిన రైతులు.. జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేష్, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, బిసే ప్రదీప్, బిసే ఛాయలుగా గుర్తించారు.
 
బుధవారం అప్పర్ మానేరు ప్రాజెక్టుకు అవతలి వైపు పశువులను మేపడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వరదల్లో చిక్కుకున్నారు. జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, ఆహారం అందించడంతో పాటు రాత్రంతా పరిస్థితిని పర్యవేక్షించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గీతే బుధవారం మధ్యాహ్నం నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు సంఘటన స్థలంలోనే మకాం వేసి, వ్యక్తిగతంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ, ఎన్డీఆర్ఎఫ్‌తో సమన్వయం చేసుకున్నారు. 
 
గురువారం ఉదయం, ఆర్మీ హెలికాప్టర్లు వరదల్లో చిక్కుకున్న రైతులను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకువచ్చాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలను సమీక్షించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

Mamita Baiju: అందుకే డ్యూడ్‌.. నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా వుంది : మమిత బైజు

K-Ramp: దీపావళికి అన్ని హిట్ కావాలి. K-ర్యాంప్ పెద్ద హిట్ కావాలి : డైరెక్టర్ జైన్స్ నాని

Siddu jonnalgadda: యూత్ సినిమాలంటే.. ఎలా వుండాలో.. తెలుసు కదా. చెబుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments