Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 15 నవంబరు 2024 (22:43 IST)
kasthuri
తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. రోజు రోజుకీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే యువకులు పెరుగుతున్నారు. హైదరాబాదులో ఆలయ ప్రదక్షణలు చేస్తుండగా ఒక యువకుడు, పెళ్లి బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుండెపోటు కారణంగా 12 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన చెన్నూరు పట్టణంలోని పద్మానగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.
 
పద్మానగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్, రమ్య దంపతుల కుమార్తె కస్తూరి నివృత్తి ఆడుకుంటుండగా కుప్పకూలిపోయిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించడంతో ఆమె తల్లిదండ్రులను కలిచివేసింది. 
 
ఆమె పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. పవిత్రమైన కార్తీక మాసం పౌర్ణమిని రోజున పాఠశాల సెలవు కావడంతో ఇంట్లో ఆడుకుంటూ కనిపించిన బాలిక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ ఇంట విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments