Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 15 నవంబరు 2024 (22:43 IST)
kasthuri
తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. రోజు రోజుకీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే యువకులు పెరుగుతున్నారు. హైదరాబాదులో ఆలయ ప్రదక్షణలు చేస్తుండగా ఒక యువకుడు, పెళ్లి బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుండెపోటు కారణంగా 12 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన చెన్నూరు పట్టణంలోని పద్మానగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.
 
పద్మానగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్, రమ్య దంపతుల కుమార్తె కస్తూరి నివృత్తి ఆడుకుంటుండగా కుప్పకూలిపోయిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించడంతో ఆమె తల్లిదండ్రులను కలిచివేసింది. 
 
ఆమె పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. పవిత్రమైన కార్తీక మాసం పౌర్ణమిని రోజున పాఠశాల సెలవు కావడంతో ఇంట్లో ఆడుకుంటూ కనిపించిన బాలిక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ ఇంట విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments