మీది రాజకీయ పార్టీ అయితే.. మాది మఠమా? : కేసీఆర్‌

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (08:00 IST)
'మీది రాజకీయ పార్టీ అయితే.. మాది మఠమా' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో సీఎం మాట్లాడారు. రాజకీయంగా మాట్లాడితే రాజకీయ సమాధానమే వస్తుందన్నారు.

భట్టి విక్రమార్క మాట్లాడింది ప్రజలు వింటున్నారన్నారు. ప్రతిపక్షాలు సబబుగా మాట్లాడితే సబబైన సమాధానమే వస్తుందన్నారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ దొందూ దొందేనన్నారు. డ్రామా కంపెనీల్లా తయారయ్యాయని విమర్శించారు.
 
దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంటుందని కేసీఆర్‌ అన్నారు. 2014-19 మధ్య కేంద్రానికి భారీగా పన్నులు చెల్లించామన్నారు. ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో చెల్లించామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1.12లక్షల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. హైదరాబాద్‌కు 24 గంటల నీటి సదుపాయం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అవసరమైతే మద్యం ధరలు మళ్లిd పెంచుతామన్నారు.

ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచలేదని, ఇప్పుడు బాజాప్తా పెంచుతామన్నారు. మైనస్‌లో ఉన్న అనేక రంగాల్ని ప్లస్‌లోకి తెచ్చామని కేసీఆర్‌ అన్నారు. అప్పుల్లో ఉన్న విజయా డైరీని లాభాల్లోకి తెచ్చామన్నారు. తాము కంది రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందన్నారు. కనీస మద్దతు ధర కేంద్రం చేతుల్లో ఉందన్నారు. ఓల్డ్‌ సిటీలో మెట్రో ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు.

బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో సీఎం మాట్లాడారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.

పేదల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ప్రస్తుతం పెన్షన్‌ను వందశాతం పెంచి రూ.2,016 చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.200 పెన్షన్‌ ఇచ్చేవారన్నారు. ప్రాజెక్టులకు డీపీఆర్‌ కావాలని విపక్షాలు అడుగుతున్నాయని, ప్రాజెక్టులకు బహిరంగంగా టెండర్లు పిలుస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నామని ప్రశ్నించారు.
 
చరిత్ర సృష్టించిన తెలంగాణ శాసనసభ
తెలంగాణ శాసనసభ చరిత్ర సృష్టించింది. ఒకే రోజు 25 బడ్జెట్ పద్దులతోపాటు 5 బిల్లులు, ఒక తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. 25 మంది ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనగా పదిమంది మంత్రులు సమాధానం ఇచ్చారు. కరోనా ప్రభావం దృష్ట్యా బడ్జెట్ సమావేశాలు కుదించడంతో ఆదివారం అసెంబ్లీ అజెండాలో చాలా అంశాలు చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments