Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (09:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 30న పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లతో సహా అన్ని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలి. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపుల యజమానులు తెరుచుకోవద్దని ఈసీ సూచించింది. 
 
ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి వైన్ షాపు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం, ఇతర పదార్థాల విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
 
అదేవిధంగా అక్రమ మద్యం రవాణాపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా పంపిణీ చేస్తున్న రూ.115.71 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్‌ను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments