Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు గెలిచినా తొలిసారే...

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (08:49 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, నాంపల్లి, చార్మినార్, బహదూర్పురా, కంటోన్మెంట్ స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీ  చేస్తున్నారు. ఈ నాలుగు చోట్ల ఎవరు గెలిచినా కొత్త ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్టు అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని ఈ నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు తొలిసారి గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. 
 
ఈ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల మధ్యే పోరు జరుగుతోంది. అంటే అక్కడ ఎవరు గెలిచినా తొలిసారి ఎమ్మెల్యే అవుతారు. నాలుగు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి కొత్త వారే పోటీలో ఉన్నారు. మిగతా 11 నియో జకవర్గాల్లోనూ కొత్త అభ్యర్థులు ఎంపి కయ్యే అవకాశమున్నా అక్కడ గతంలో, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వారు బరిలో ఉన్నారు.
 
ముఖ్యంగా కంటోన్మెంట్, చార్మినార్, బహదూర్ పురా, నాంపల్లి నియోజకవర్గాల ఓటర్లకు కొత్త ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించనున్నారు. కంటోన్మెంట్ కంటోన్మెంట్ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత, బీజేపీ నుంచి శ్రీగణేష్, కాంగ్రెస్ నుంచి వెన్నెల గద్దర్ ఉన్నారు. వీరి మధ్యే పోటీ నెలకొంది.
 
బహదూర్‌పురా : నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంఐఎం నుంచి మహమ్మద్. ముబీన్, బీజేపీ నుంచి వై.నరేశ్, బీఆర్ఎస్ నుంచి మీర్ ఇనాయత్ అలీ బాక్రీ, కాంగ్రెస్ నుంచి రాజేశ్కుమార్ పులిపాటి పోటీ చేస్తున్నారు.
 
చార్మినార్ : నియోజకవర్గంలో మొత్తం 14 మంది పోటీ చేస్తుండగా ఎంఐఎం నుంచి మీర్ జుల్ఫీకర్ అలీ, బీజేపీ నుంచి మేఘారాణి అగర్వాల్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ ముజీబుల్లా షరీఫ్, బీఆర్ఎస్ నుంచి సలావు ద్దీన్ లోఢీలు పోటీ చేస్తున్నారు. 
 
నాంపల్లి : ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 34 మంది పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆనంద్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, బీజేపీ నుంచి జేఎల్ రాహుల్ చంద్ర, ఎంఐఎం నుంచి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ పోటీలో ఉన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments