Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహినూర్ గ్రూప్ ఎండీ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (13:20 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడింది. అయితే ఐటీ దాడులు మాత్రం ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఒకచోట ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం పాతబస్తీలోని బడా వ్యాపారులపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. 
 
శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు అందుతున్నట్లు సమాచారం అందడంతో ఐటీ శాఖ దాడులు చేసింది. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగుతాయని సమాచారం. 
 
పాతబస్తీతో పాటు హైదరాబాద్ శాస్త్రిపురంలో కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్ ఎండీ మాజీద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్త షానవాజ్‌తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 
 
కోహినూర్ కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నడుపుతున్న వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 
 
ఈ దాడుల్లో ఐటీ శాఖ అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్ కూడా ఉన్నారు. పాతబస్తీకి చెందిన బడా వ్యాపారులనే లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments