Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో పోలింగ్ : అభ్యర్థుల గుండెల్లో గుబులు

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (10:55 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. దీంతో అభ్యర్తులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని అంచనాలు వేస్తున్నారు. అధిరాక తెరాస మాత్రం తమ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఓటర్లు కారు గుర్తుకు ఓటేశారని అంటున్నారు. కానీ, విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమంటూ బల్లగుద్ధి వాదిస్తున్నారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూలేనంతగా తాజా ఎన్నికల్లో రికార్డుస్థాయి పోలింగ్‌ను నమోదైనట్టు చెప్పారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యంత చైతన్యం చూపగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లు మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయారని తెలిపారు. 
 
రాష్ట్రంలోని 74 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 70 శాతానికిపైగా పోలింగ్ నమోదుకాగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సెగ్మెంట్లలో 50 శాతానికి మించలేదని చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సగటున 73.2 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. గతంలో ఎన్నడూ ఈస్థాయిలో పోలింగ్ నమోదుకాలేదని పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. 
 
2014 ఎన్నికలతో (69.5శాతం) పోలిస్తే.. ఈసారి సుమారు 3.70 శాతం మేర పోలింగ్ పెరిగిందని రజత్‌కుమార్ తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేయటం, ప్రజల్లో ఓటుపై పెరిగిన చైతన్యం వారిని పోలింగ్ కేంద్రాలవరకు రప్పించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments