Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు : ఆలస్యం కానున్న ఫలితాల వెల్లడి.. ఎందుకు?

Telangana polls
Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:13 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఇందుకుసంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల వెల్లడిలో కాస్త ఆలస్యంకానున్నాయి. 
 
సాధారణంగా ఎన్నికల సంఘం కొత్త నిబంధన మేరకు తొలి ఫస్ట్ రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడికానుంది. అయితే, ఎన్నికల సంఘం తీసుకున్న కొత్త నిబంధన మేరకు తొలి రౌండ్ ఫలితం వెల్లడిలో మరింత జాప్యంకానుంది. 
 
ఈ నిబంధన ఏంటో పరిశీలిస్తే, సాధారణంగా ప్రతి ఔండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ వివరాలను స్టేట్మెంట్ రూపంలో నమోదు చేయాలి. ఆ కాపీని ఆయా పార్టీలకు చెందిన రిప్రజెంటేటివ్‌లకు అందజేస్తారు. వారు అంగీకరిచిన తర్వాత ఈ స్టేట్మెమెంట్‌పై రిటర్నింగ్ అధికారి సంతకం చేయాల్సి వుంది. ఆ తర్వాతే మీడియాకు అందజేస్తారు. 
 
అందులో ఓ కాపీని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. గతంలో అయితే ప్రతి రౌండ్ ఫలితాన్ని చూపించేవారు. ఇప్పుడు మాత్రం ప్రతి రౌండ్ ఫలితాన్ని స్టేట్మెంట్‌గా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యం కావొచ్చని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫైనల్ రిజల్ట్స్ తెలిసేవి. కానీ, ఇప్పుడు మరో 2 గంటలు ఆలస్యం కావొచ్చని వారు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments