Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : చిత్తుగా ఓడిన తెరాస మంత్రులు

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (14:21 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాసకు చెందిన ఇద్దరు మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. వీరిలో ఒకరు గతంలో కాంగ్రెస్ నేతగా, మంత్రిగా పని చేసి తెరాసలోకి జంప్ అయ్యారు. ఈయన పేరు జూపల్లి కృష్ణారావు. గత తెరాస సర్కారులో మంత్రిగా పని చేశారు. 
 
ప్రస్తుతం ఈయన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన తన సమీప అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన బీరం హర్షవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 
 
అలాగే, ఖమ్మం జిల్లా పాలేరులో తెరాస సీనియర్‌ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కందాళ ఉపేందర్‌ రెడ్డి చేతిలో కేవలం 1,950 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments