Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర.. నెల రోజుల్లో గుణాత్మక మార్పు.. కేసీఆర్

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (17:28 IST)
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశానికి తెలంగాణ దిక్చూచి అవుతుందని చెప్పారు. త్వరలో తామేంటో చూపిస్తామని... దేశంలో నెల రోజుల్లో గుణాత్మక మార్పు చూస్తారని కేసీఆర్ చెప్పారు. దేశంలో రైతులను పట్టించుకునే వారు లేరన్నారు. నాలుగు పార్టీలను ఏకం చేయడం రాజకీయం కాదని.. ప్రజలను ఏకం చేయాలని కేసీఆర్ తెలిపారు. 
 
తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. చైతన్యవంతమైన గడ్డ కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు నాయకులు కాదని... ప్రజలన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులందరూ వచ్చి ప్రచారం చేశారు. కానీ ప్రజలదే అంతిమ తీర్పు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
ఎన్నికల ఫలితాల సందర్భంగా కేంద్ర ప్రముఖులు మమతా బెనర్జీ, సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా దేశంలో ఓ అనిశ్చితి ఉంది. ఇది మారాలి. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చాం. తమకు ప్రజలే బాస్‌లు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తానని చెప్పారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

తర్వాతి కథనం
Show comments