Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ప్రాంతానికి బ్లేడుతో బయలుదేరిన బండ్ల గణేష్... ఏం కోసుకుంటాడో?

Advertiesment
Bandla Ganesh
, మంగళవారం, 11 డిశెంబరు 2018 (12:29 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అది కూడా బ్లేడుతో నడిరోడ్డుపై కోసుకుని చనిపోతానంటూ చెప్పారు గణేష్. రాజకీయాల్లో ఇలాంటి మాటలు చెప్పడం మామూలేనని అనుకున్నారు. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నేను చెప్పింది చేసి తీరుతానని తేల్చి చెప్పారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో టిఆర్ఎస్ వేగంగా ముందుకు వెళుతూ అధిక సీట్లను కైవసం చేసుకునే దిశగా ఉండటంతో బండ్ల గణేష్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తన ఇంటి నుంచి బ్లేడుతో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. గణేష్ వెంట 8 మంది స్నేహితులు కూడా ఉన్నారు. 
 
అయితే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గణేష్‌ ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకోవాలని ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు సూచించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హైడ్రామా నడిచే అవకాశం కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టి.జీవన్ రెడ్డికి ఏడోసారి కలిసిరాలేదు.. జగిత్యాలలో తెరాస గెలుపు