Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక్కోసి హుండీలో వేసిన తూ.గో వాసి

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (11:30 IST)
ఎన్నికల్లో పోటీ చేసే తమ అభిమాన నేతలు విజయం సాధించాలని కార్యకర్తలు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. తాజాగా తెరాస అధినేత కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని తన నాలుక కోసి ఆలయ హుండీలో వేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరుగనుంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోనే తెరాస సింగిల్‌గా 119 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ సారథ్యంలో మరికొన్ని పార్టీలు కూటమిగా ఏర్పాటై పోటీ చేస్తున్నాయి. దీంతో పోటీ హోరాహోరీగా ఉంది. 
 
ఈనేపథ్యంలో హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో నివశించే తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ అనే వ్యక్తి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తన నాలుకను కోసుకున్నాడు. 
 
ఈ నాలుకను బంజారాహిల్స్‌లోని ఓ ఆలయం హుండీలో కానుకగా వేశాడు. దీంతో ఆ యువకుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడున్న వారు సమీపంలోని ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments