Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : నోట్ల కట్టలే కట్టలు... ఏరులై పారుతున్న మద్యం

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (09:14 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం జరిగిన ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అదేసమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు దిగారు. ఇందులోభాగంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా పంచుతున్నారు. 
 
ఎన్నికల్లో ధన ప్రవాన్ని అడ్డుకునేందుకు గట్టి నిఘా పెట్టారు. అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈనెల 5వ తేదీవరకు ఏకంగా రూ.137 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు. 
 
తాజాగా ప్రజాకూటమి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు చెందినదిగా భావిస్తున్న రూ.3.30 కోట్ల నగదును నిఘా అధికారులు పట్టుకున్నారు. అలాగే, హైదరాబాద్‌లో 8 మంది హవాలా ఆపరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంమీద తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచి ధన, మద్యం ప్రవాహాలు ఏరులై పారుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments