Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ స్వీట్ పిల్లలకి చేసి పెడితే లొట్టలేసుకుని తింటారంతే...

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:18 IST)
కరోనావైరస్ కారణంగా ఇపుడు బయట స్వీట్ షాపుల్లో ఏమి తినాలన్నా భయంగా వుంటుంది. అందువల్ల చక్కగా ఇంట్లోనే స్వీట్ పదార్థాలను తయారు చేసి పిల్లలకి పెడుతుంటే టేస్టీగా లాగించేస్తారు. ముఖ్యంగా కొబ్బరి తురుముతో చేసిన మైసూర్ పాక్ సూపర్ టేస్టీగా వుంటుంది. అదెలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
శనగపిండి- ఒక కప్పు, 
కొబ్బరితురుము- ఒక కప్పు
పాలు- ఒక కప్పు,
నెయ్యి- ఒక కప్పు,
పంచదార- రెండు కప్పులు,
జీడిపప్పు- కొద్దిగా
 
తయారుచేసే విధానం : 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని చిన్నచిన్న సమభాగాలు కట్‌ చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments