Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ స్వీట్ పిల్లలకి చేసి పెడితే లొట్టలేసుకుని తింటారంతే...

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:18 IST)
కరోనావైరస్ కారణంగా ఇపుడు బయట స్వీట్ షాపుల్లో ఏమి తినాలన్నా భయంగా వుంటుంది. అందువల్ల చక్కగా ఇంట్లోనే స్వీట్ పదార్థాలను తయారు చేసి పిల్లలకి పెడుతుంటే టేస్టీగా లాగించేస్తారు. ముఖ్యంగా కొబ్బరి తురుముతో చేసిన మైసూర్ పాక్ సూపర్ టేస్టీగా వుంటుంది. అదెలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
శనగపిండి- ఒక కప్పు, 
కొబ్బరితురుము- ఒక కప్పు
పాలు- ఒక కప్పు,
నెయ్యి- ఒక కప్పు,
పంచదార- రెండు కప్పులు,
జీడిపప్పు- కొద్దిగా
 
తయారుచేసే విధానం : 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని చిన్నచిన్న సమభాగాలు కట్‌ చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments