Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహ హింస పెరిగిపోతుంటే.. సానియాకు కోపమొచ్చింది..

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (18:10 IST)
లాక్​డౌన్ నేపథ్యంలో ఒక్కపూట కూడా ఆహారం దొరక్క ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో వంటకాల ఫొటోలను ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్​డౌన్ కాలంలో గృహ హింస కేసులు పెరిగినట్టు ఇటీవల నివేదికలు వెల్లడి అయిన తరుణంలో సానియా మీర్జా ఫైర్ అయ్యింది. 
 
మహిళలు ధైర్యంగా ఉండి, పురుషులతో సమానంగా గౌరవం కోసం డిమాండ్ చేయాలని సానియా సూచించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఐక్యంగా వుండి.. పురుషులు, మహిళలను సమానంగా గౌరవంతో చూడలని సానియా తెలిపింది. 
 
గృహ హింసలు పెరిగిపోతున్నాయనే నివేదికలను చూశానని.. ఇలాంటివి అమానుషం. గృహహింసను తాను ఎప్పుడూ తీవ్రంగా ఖండిస్తా. మహిళలను తమతో సమానంగా పురుషులు గౌరవించాలి. మర్యాదగా ప్రవర్తించాలి. గౌరవం కోసం డిమాండ్ చేయాల్సిన బాధ్యత మహిళలపై ఉందంటూ సానియా మీర్జా వెల్లడించింది. 
 
తాము రూ.2.5కోట్ల నిధులను సమీకరించి లక్షల మందికి ఆహారం అందించామని, ఇంకా ఎక్కువ మందికి నేరుగా సాయం చేయాలని అనుకుంటున్నానని సానియా మీర్జా తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసినా, సరిపోదని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments