Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన ప్రదర్శన ఇంకాస్త మెరుగుపర్చుకోవాలి : నీరజ్ చోప్రా

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:24 IST)
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా, జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా తన విజయంపై స్పందించారు. దేశానికి పతకం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే, తన ప్రదర్శనను ఇంకా మెరుగుపరుుచుకోవాల్సి ఉందన్నారు. తప్పకుండా ఈ అంశంపై దృష్టిసారిస్తామని తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లు చాలా అద్భుత ప్రదర్శన చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, పారిస్ ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత్‌కు తొలి రజత పతకం వచ్చింది. ఫైనల్లో పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ 92 మీటర్ల మార్క్‌ను తాకగా.. నీరజ్ 89.45 మీటర్లు విసిరాడు. నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే స్పందించగా.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు. అయితే, తన ప్రదర్శనపై సమీక్షించుకోవాల్సిన అవసర ఉందని నీరజ్ చెప్పుకొచ్చాడు. 
 
'దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే, నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తప్పకుండా దీనిపై మేం కూర్చొని మాట్లాడుకుంటాం. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు చాలా అద్భుత ప్రదర్శన చేశారు. జావెలిన్ త్రో ఈవెంట్లో చాలా పోటీ ఉంది. ప్రతి అథ్లెట్ తనదైన రోజున సత్తా చాటుతాడు. ఇది అర్షద్ డే. నేను మాత్రం వందశాతం కష్టపడ్డాను. కానీ, మరికొన్ని అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాననే నమ్మకం ఉంది' అని నీరజ్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు : ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments