Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ ఓడిపోయారనీ ఆటగాళ్లకు గుండు కొట్టించిన కోచ్... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (08:59 IST)
సాధారణంగా ఆటపోటీల్లో గెలుపోటములు సహజం. కానీ, తాను కోచింగ్ ఇచ్చిన జట్టు ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడాన్ని కోచ్ జీర్ణించుకోలేక పోయాడు. దీంతో జట్టులోని క్రీడాకారులందరికీ గుండు కొట్టించాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బెంగాల్ అండర్ -19 హాకీ టీమ్‌ జట్టుకు ఆనంద్ అనే వ్యక్తి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ పర్యవేక్షణలోని జట్టు.. జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా, జబల్‌పూర్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగాల్ అండర్-19 జట్టు 1-5 తేడాతో నామ్‌దారి ఎలెవన్ జట్టు చేతిలో ఓడిపోయింది. దీన్ని ఆ జట్టు కోచ్ ఆనంద్ జీర్ణించుకోలేక పోయాడు. ఆపై జట్టులో 18 మంది ఆటగాళ్లలో 16 గుండుతో కనిపించారు. అంటే జట్టు కోచ్ పరుష పదజాలంతో దూషించడం వల్లే వారు గుండు కొట్టించుకున్నట్టు సమాచారం. 
 
దీనిపై కోచ్ ఆనంద్ స్పందిస్తూ, ప్రత్యర్థి చేతిలో జట్టు ఓడిపోయినందుకు ఆటగాళ్ళపై ఆగ్రహించిన మాట నిజమేనని, కానీ, గుండుకొట్టించుకోమని తాను ఆదేశించలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం వైరల్ కావడంతో బీహెచ్ఏ కార్యదర్శి స్వపన్ బెనర్జీ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

తర్వాతి కథనం
Show comments