Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : పీవీ సింధు ఖాతాలో రెండో విజయం

Webdunia
బుధవారం, 28 జులై 2021 (10:10 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్-జెలో హాంకాంగ్ క్రీడాకారిణి చెయుంగ్ ఎన్‌గాన్ యితో జరిగిన పోరులో రియో రజతపతక విజేత సింధు 2-0తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వార్టర్స్‌కు అర్హత సాధించి పతకంపై ఆశలు రేపింది. 
 
ఇదిలావుంటే, మహిళల హాకీలో భారత జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. పూల్-ఎలో భాగంగా గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో 1-4 తేడాతో పరాజయం పాలైంది. ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 
 
ఎలిమినేషన్స్ రౌండ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన షానీ చేతిలో 6-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్‌లో రోయింగ్ జంట అర్జున్‌లాల్ జాట్-అర్వింద్ సింగ్ జోడీ 6: 24.41 రేసును పూర్తిచేసి ఫైనల్ బికి చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

తర్వాతి కథనం
Show comments