Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : చరిత్ర సృష్టించిన పీవీ సింధు - కాంస్యం కైవసం

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (18:06 IST)
భారత స్టార్ బ్యాడ్మింటన్, తెలుగు అమ్మాయి. పీవీ సింధు చరిత్ర సృష్టించారు. జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ 2020 పోటీల్లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విశ్వ క్రీడల్లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి భార‌త మ‌హిళ‌గా నిలిచింది. 
 
ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జ‌రిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వ‌రుస గేమ్స్‌లో విజ‌యం సాధించింది. దీంతో సింధు ఖాతాలో మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ చేరింది. 
 
నిజానికి శనివారం జరిగిన సెమీస్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓడిన సింధు ఆదివారం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడింది. పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కనిపించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్న సింధు కాంస్యంతో మెరిసింది.  
 
కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన విష‌యం తెలిసిందే. సింధు కంటే ముందు రెజ్ల‌ర్ సుశీల్‌కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో భార‌త్ త‌ర‌పున రెండు మెడ‌ల్స్ గెలిచాడు. అత‌డు 2008 గేమ్స్‌లో బ్రాంజ్‌, 2012 గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్‌ గెలిచిన విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

తర్వాతి కథనం
Show comments