Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ స్టేడియాల్లో ఒలింపిక్స్ క్రీడలు

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (10:56 IST)
జపాన్ దేశ రాజధాని టోక్యో కేంద్రం వేదికగా ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం జరుగనుంది. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ కమిటీ యూటర్న్ తీసుకుంది. 
 
ఈ పోటీలకు ప్రేక్షకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని నాలుగు రోజుల క్రితం ప్రకటించిన కమిటీ తాజాగా మరో ప్రకటన చేస్తూ.. ఖాళీ స్టేడియంలోనే క్రీడలు నిర్వహించాలన్న ప్రతిపాదనను పూర్తిగా విరమించుకోలేదని ప్రకటించింది. ఈ మేరకు కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో శుక్రవారం వెల్లడించారు.
 
మరోవైపు, జూలై 23వ తేదీ నుంచి ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించబోమని చాలా నెలల క్రితమే ప్రకటించారు. అయితే, స్థానికుల విషయంలో కొంత సడలింపు ఇచ్చారు. 50 శాతానికి మించకుండా గరిష్ఠంగా 10 వేల మందిని అనుమతించాలని నిర్ణయించారు. 
 
కానీ, ఇప్పుడు ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహించాలన్న అంశం తమ పరిగణనలోనే ఉందన్న సీకో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జపాన్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతోనే ప్రేక్షకులు లేకుండానే క్రీడల నిర్వహణకు మొగ్గు చూపుతున్నారు. కాగా, ఈ పోటీలు గత యేడాది జరగాల్సివుండగా, కరోనా కారణంగా వాయిదాపడిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తర్వాతి కథనం
Show comments