Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రా చేసుకునే మ్యాచ్‌ను చేజేతులా అప్పగించారు : సచిన్ టెండూల్కర్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (08:18 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో న్యూజిలాండ్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. నిజానికి డ్రా కావాల్సిన మ్యాచ్‌ను భారత్ చేజేతులా కోల్పోయింది. ఈ ఓటమిని ప్రతి ఒక్క భారత సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేక పోతున్నాడు. అలాంటి వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఒకరు. 
 
కేవలం పది బంతుల తేడాతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కీలక బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా అవుట్ కావడం టీమిండియా అవకాశాలను దారుణంగా దెబ్బతీసిందని సచిన్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ క్రీజులో ఎక్కువ సేపు ఉండుంటే ఆట మరోలా ఉండేదని, కనీసం భారత్ డ్రా చేసుకునేందుకు అవకాశాలు ఉండేవని వివరించాడు. 
 
టీమిండియా ఓటమికి పరోక్షంగా ఈ ఇద్దరి వైఫల్యమే కారణమని సచిన్ తెలిపాడు. ఆటకు చివరి రోజున తొలి సెషన్ ఎంతో కీలకమని తాను ముందే చెప్పానని అన్నాడు. కోహ్లీ, పుజారా వెంటవెంటనే అవుట్ కావడంతో జట్టు ఒత్తిడికి గురైందని, ఆపై వరుసగా వికెట్లు కోల్పోయిందని ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో విశ్లేషించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments