Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : భారత హాకీ జట్టు ఖాతాలో మరో గెలుపు

Webdunia
గురువారం, 29 జులై 2021 (09:09 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టు ఖాతాలో మరో గెలుపు వచ్చి చేరింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాపై భారత్ విజయం సాధించింది. గ్రూప్‌-ఏ నాలుగో మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌ తొలి క్వార్టర్ ముగిసేసరికి 0-0తో ఇరుజట్లు ఖాతా తెరవలేదు. అయితే మ్యాచ్‌ 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్‌ వరుణ్‌ తొలి గోల్‌ చేసి జట్టును 1-0తో లీడ్‌లో నిలిపాడు. అయితే కొద్ది సేపట్లోనే (మ్యాచ్‌ 48వ నిమిషంలో) అర్జెంటీనా ఆటగాడు మైకో కసెల్లా తన జట్టుకు తొలి గోల్‌ అందించాడు. 
 
ఫలితంగా ఇరుజట్ల స్కోర్‌ సమమైంది. ఆ తర్వాత మ్యాచ్‌ 58వ నిమిషంలో ప్రసాద్‌ వివేక్‌ సాగర్‌ రెండో గోల్‌ చేయడంతో  భారత జట్టుకు ఆధిక్యం లభించింది. ఇక 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడో గోల్ చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. నాలుగో క్వార్టర్‌లోనే భారత్‌ రెండు పాయింట్లు సాధించడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

తర్వాతి కథనం
Show comments