చరిత్ర సృష్టించిన సాత్విక్ - చిరాగ్ శెట్టి

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (13:17 IST)
భారత టాప్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన తొలి భారత డబుల్స్ జంటగా రికార్డులకెక్కారు. గతంలో సైనా (2010, 2012), శ్రీకాంత్ (2017) ఇండోనే సియా ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ సాధించారు. 
 
ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో వరల్డ్ నెం:6 సాత్విక్-చిరాగ్ ద్వయం 21-17, 21-18తో మలేసియాకు చెందిన వరల్డ్ చాంపి యన్లు ఆరోన్ చియా - సొ వూయి యిక్‌పై వరుస గేముల్లో విజయం సాధించారు. గతంలో ఈ జంటతో ముఖాముఖి పోరులో 0-8తో పేలవ రికార్డున్న సాత్విక్ జోడీ. ఈసారి అద్భుత రీతితో పోరాడింది. 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వ్యూహాత్మకంగా ఆడుతూ మలేసియా జోడీపై తొలి విజయాన్ని నమోదు చేసింది. 
 
మొదటి గేమ్ ఆరంభంలో సాత్విక్ జోడీ 3-5తో వెనుకబడిన తర్వాత పుంజుకొంది. వరుసగా 6 పాయింట్లు సాధించిన భారత ద్వయం 11-9తో బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను తమ ఖాతాలో వేసుకొంది. ఇక రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వానేనా అన్న ట్టుగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగినా ప్రత్యర్థికి సాత్విక్ జోడీ పుంజుకొనే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తమ వశం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments