Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన సాత్విక్ - చిరాగ్ శెట్టి

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (13:17 IST)
భారత టాప్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన తొలి భారత డబుల్స్ జంటగా రికార్డులకెక్కారు. గతంలో సైనా (2010, 2012), శ్రీకాంత్ (2017) ఇండోనే సియా ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ సాధించారు. 
 
ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో వరల్డ్ నెం:6 సాత్విక్-చిరాగ్ ద్వయం 21-17, 21-18తో మలేసియాకు చెందిన వరల్డ్ చాంపి యన్లు ఆరోన్ చియా - సొ వూయి యిక్‌పై వరుస గేముల్లో విజయం సాధించారు. గతంలో ఈ జంటతో ముఖాముఖి పోరులో 0-8తో పేలవ రికార్డున్న సాత్విక్ జోడీ. ఈసారి అద్భుత రీతితో పోరాడింది. 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వ్యూహాత్మకంగా ఆడుతూ మలేసియా జోడీపై తొలి విజయాన్ని నమోదు చేసింది. 
 
మొదటి గేమ్ ఆరంభంలో సాత్విక్ జోడీ 3-5తో వెనుకబడిన తర్వాత పుంజుకొంది. వరుసగా 6 పాయింట్లు సాధించిన భారత ద్వయం 11-9తో బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను తమ ఖాతాలో వేసుకొంది. ఇక రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వానేనా అన్న ట్టుగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగినా ప్రత్యర్థికి సాత్విక్ జోడీ పుంజుకొనే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తమ వశం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments