Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధు కోసం ప్రత్యేక విమానం.. ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కారు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (08:41 IST)
రియో ఒలింపిక్స్ పోటీల్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో దేశానికి రజత పతకం సాధించి పెట్టిన భారత షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు రాత్రికి రాత్రే ఓ స్టార్‌గా మారిపోయింది. ఫలితంగా ఆమెను రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక అతిథిగా పరిగణిస్తున్నాయి. అంతేనా పోటాపోటీగా ఘనంగా సన్మానాలు చేస్తున్నాయి. 
 
బ్రెజిల్ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న సింధుకు తెలంగాణ సర్కారు ఘనస్వాగతం పలికింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దాకా ఆమెను భారీ ర్యాలీ నడుమ తీసుకెళ్లింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత ఘనంగా స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేసింది. 
 
ఇందుకోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం కూడా సిద్ధం చేసింది. ఇందులో సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, సింధు కుటుంబ సభ్యులు విజయవాడకు వస్తారు. ఈ విమానం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతుంది. ఇక ఈ ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోగానే సింధు, గోపీచంద్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లుచేసింది. 

లోక్‌సభ ఎన్నికలు.. చివరి దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments