Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి..

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే చైనాకు చెందిన అన్‌సీడెడ

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (10:00 IST)
మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే చైనాకు చెందిన అన్‌సీడెడ్‌ చెన్‌ యుఫీ 18-21, 21-19, 21-17 స్కోరుతో సింధూపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన అకనే యమగుచి 19-21, 21-13, 21-15 స్కోరుతో సైనా నెహ్వాల్‌పై సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది.
 
అయితే మలేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత క్రీడాకారుడు అజయ్‌ జయరామ్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన కియో బిన్‌పై 21-11, 21-8 వరస సెట్లలో సునాయసంగా గెలుపొందాడు. కేవలం 31 నిమిషాల్లోనే జయరామ్ మ్యాచ్‌ను ముగించాడు. 
 
కాగా, పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత జోడి ఓటమి పాలైంది. మను అత్రి-సుమిత్‌ రెడ్డి జోడీపై 18-21, 21-18, 21-17 స్కోరుతో చైనీస్‌ తైపీకి చెందిన లియో కౌన్‌ హు-లు చియా పిన్‌ జోడీ గెలుపొందింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

తర్వాతి కథనం
Show comments