Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ నుంచి పీవీ సింధు అవుట్

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (19:49 IST)
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. బర్మింగ్‌హామ్‌లోని యుటిలిటా ఎరీనా వేదికగా రౌండ్‌-16 మ్యాచ్‌లో ఓడిపోయింది. 
 
చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ షట్లర్ అన్‌సే యంగ్ చేతిలో 21-19, 21-11 తేడాతో వరుస సెట్లలో సింధు ఓటమిపాలయ్యింది. 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్‌లో హోరాహోరీగా తలపడిన సింధు.. రెండవ సెట్‌లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. 
 
అంతకుముందు రౌండ్‌-32లో జర్మనీకి చెందిన షట్లర్ వోన్నే లీపై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. సింధు ఓటమితో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో ఆశలన్నీ స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉన్నాయి.
 
మరోవైపు డబుల్స్‌ విభాగంలో భారత టాప్ జోడీ సాత్విక్‌ - చిరాగ్ జోడి పురుషుల రౌండ్‌-16లో ఇండోనేషియా జంట మహమ్మద్ షోహిబుల్ ఫిక్రి-బగాస్ మౌలానాతో తలపడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments