Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ నుంచి పీవీ సింధు అవుట్

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (19:49 IST)
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. బర్మింగ్‌హామ్‌లోని యుటిలిటా ఎరీనా వేదికగా రౌండ్‌-16 మ్యాచ్‌లో ఓడిపోయింది. 
 
చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ షట్లర్ అన్‌సే యంగ్ చేతిలో 21-19, 21-11 తేడాతో వరుస సెట్లలో సింధు ఓటమిపాలయ్యింది. 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్‌లో హోరాహోరీగా తలపడిన సింధు.. రెండవ సెట్‌లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. 
 
అంతకుముందు రౌండ్‌-32లో జర్మనీకి చెందిన షట్లర్ వోన్నే లీపై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. సింధు ఓటమితో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో ఆశలన్నీ స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉన్నాయి.
 
మరోవైపు డబుల్స్‌ విభాగంలో భారత టాప్ జోడీ సాత్విక్‌ - చిరాగ్ జోడి పురుషుల రౌండ్‌-16లో ఇండోనేషియా జంట మహమ్మద్ షోహిబుల్ ఫిక్రి-బగాస్ మౌలానాతో తలపడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments