Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గిన ముంబై.. సచిన్ అభినందనలు

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (19:01 IST)
Ranji Trophy
ఎనిమిదేళ్ల తర్వాత 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న ముంబైకి లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపాడు. ఎనిమిదేళ్ల తర్వాత రంజీ టైటిల్‌ను ముంబై గెలుచుకుంది. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5వ రోజు విదర్భను 169 పరుగుల తేడాతో ఓడించి రికార్డు-42వ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో ముగిసింది.
 
42వ రంజీ ట్రోఫీని గెలుచుకున్నందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అభినందనలు అంటూ సచిన్ టెండూల్కర్ తెలిపారు. సచిన్‌తో పాటు జాఫర్, ఉనాద్కత్‌లు కూడా ముంబై రంజీ టీమ్‌ను అభినందించారు. వాంఖ‌డే స్టేడియంలో విద‌ర్భ‌తో జ‌రిగిన ఫైన‌ల్‌లో 169 ప‌రుగుల‌ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 ప‌రుగులు చేయ‌గా, విద‌ర్భ 105 ప‌రుగుల‌కే చాప‌చుట్టేసింది. ఆ త‌ర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 119 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకొని విద‌ర్భ ముందు 537 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ భారీ టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో విద‌ర్భ రెండో ఇన్నింగ్స్‌లో 368 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో ముంబై 169 ప‌రుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ నమోదు చేసింది. అలాగే ముంబై త‌న ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను వేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments