Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశానికి ఖ్యాతిని తెచ్చిన ఆ క్రీడాకారిణిని అలా అవమానించారు.. ఏం చేసిందంటే..

పారా ఒలింపిక్స్ వీల్ చైర్ టెన్నిస్ క్రీడాకారిణి మధుబగ్రీకి రేణిగుంట విమానాశ్రయంలో అవమానం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చిన మధు బగ్రి స్వామి దర్శనం తర్వాత తిరుగుపయనమవ

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (14:51 IST)
పారా ఒలింపిక్స్ వీల్ చైర్ టెన్నిస్ క్రీడాకారిణి మధుబగ్రీకి రేణిగుంట విమానాశ్రయంలో అవమానం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చిన మధు బగ్రి స్వామి దర్శనం తర్వాత తిరుగుపయనమవడానికి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో వెళ్ళేందుకు టిక్కెట్టును కొనుగోలు చేశారు. పారా ఒలింపిక్స్ క్రీడాకారిణి కావడంతో ఆమెకు ఒక వీల్ ఛైర్‌ను ఏర్పాటు చేశారు విమానాశ్రయ సిబ్బంది.
 
అయితే వీల్ ఛైర్‌లో ఉన్న టెన్నిస్ క్రీడాకారిణికి మూడో నెంబర్ సీటిచ్చారు. ఆ సీటు తనకు అనూకూలంగా ఉండదని, మొదటి సీటు కేటాయించమని మధు బగ్రి కోరింది. అయితే అందుకు సిబ్బంది ససేమిరా అనడంతో పాటు మధు బగ్రిని అవమానకరంగా మాట్లాడుతూ కిందకు దించేశారు. వికలాంగురాలినని కూడా చూడకుండా చాలా హీనంగా తనతో మాట్లాడడానకి మధు బగ్రి తన ఫోన్ ద్వారా వాట్సాప్‌కు మీడియాకు ఒక వీడియోను పంపించారు. 
 
దేశానికి ఖ్యాతి తెచ్చి పెట్టే తనలాంటి క్రీడాకారిణికి గౌరవం ఇవ్వని విమానాశ్రయ సిబ్బంది, కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఇస్తున్నారని వాపోయింది. తనను హేళనగా మాట్లాడి చివరకు క్షమాపణ చెప్పలేదని, విమానం నుంచి కిందకు బలవంతంగా దించేశారని మధు బగ్రి ఆరోపించింది. అయితే మధు బగ్రి వ్యాఖ్యలను విమానాశ్రయ సిబ్బంది కొట్టిపారేశారు. మధు బగ్రి అడిగిన సీటు అత్యవసర సమయంలో వాడేదని, అలాంటప్పుడు ఆమెను ఎలా కూర్చోబెడతామని వివరణ ఇచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

తర్వాతి కథనం
Show comments