Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశానికి ఖ్యాతిని తెచ్చిన ఆ క్రీడాకారిణిని అలా అవమానించారు.. ఏం చేసిందంటే..

పారా ఒలింపిక్స్ వీల్ చైర్ టెన్నిస్ క్రీడాకారిణి మధుబగ్రీకి రేణిగుంట విమానాశ్రయంలో అవమానం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చిన మధు బగ్రి స్వామి దర్శనం తర్వాత తిరుగుపయనమవ

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (14:51 IST)
పారా ఒలింపిక్స్ వీల్ చైర్ టెన్నిస్ క్రీడాకారిణి మధుబగ్రీకి రేణిగుంట విమానాశ్రయంలో అవమానం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చిన మధు బగ్రి స్వామి దర్శనం తర్వాత తిరుగుపయనమవడానికి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో వెళ్ళేందుకు టిక్కెట్టును కొనుగోలు చేశారు. పారా ఒలింపిక్స్ క్రీడాకారిణి కావడంతో ఆమెకు ఒక వీల్ ఛైర్‌ను ఏర్పాటు చేశారు విమానాశ్రయ సిబ్బంది.
 
అయితే వీల్ ఛైర్‌లో ఉన్న టెన్నిస్ క్రీడాకారిణికి మూడో నెంబర్ సీటిచ్చారు. ఆ సీటు తనకు అనూకూలంగా ఉండదని, మొదటి సీటు కేటాయించమని మధు బగ్రి కోరింది. అయితే అందుకు సిబ్బంది ససేమిరా అనడంతో పాటు మధు బగ్రిని అవమానకరంగా మాట్లాడుతూ కిందకు దించేశారు. వికలాంగురాలినని కూడా చూడకుండా చాలా హీనంగా తనతో మాట్లాడడానకి మధు బగ్రి తన ఫోన్ ద్వారా వాట్సాప్‌కు మీడియాకు ఒక వీడియోను పంపించారు. 
 
దేశానికి ఖ్యాతి తెచ్చి పెట్టే తనలాంటి క్రీడాకారిణికి గౌరవం ఇవ్వని విమానాశ్రయ సిబ్బంది, కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఇస్తున్నారని వాపోయింది. తనను హేళనగా మాట్లాడి చివరకు క్షమాపణ చెప్పలేదని, విమానం నుంచి కిందకు బలవంతంగా దించేశారని మధు బగ్రి ఆరోపించింది. అయితే మధు బగ్రి వ్యాఖ్యలను విమానాశ్రయ సిబ్బంది కొట్టిపారేశారు. మధు బగ్రి అడిగిన సీటు అత్యవసర సమయంలో వాడేదని, అలాంటప్పుడు ఆమెను ఎలా కూర్చోబెడతామని వివరణ ఇచ్చారు. 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments