Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనల్‌లో పంచ్‌ల వర్షం - నీతూ ఘన విజయం.. మరో స్వర్ణం

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (20:16 IST)
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేసింది. బాక్సింగ్‌లో అందరూ ఊహించినట్లుగానే నీతూ ఘన్‌ఘాస్‌ దేశానికి గోల్డ్ మెడల్ అందించింది. మహిళల 48 కేజీల బరువు విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్‌ను ఓడించింది. 
 
భారత బాక్సర్ పంచ్‌లకు ఇంగ్లండ్ బాక్సర్ వద్ద సమాధానం లేకపోయింది. మూడు రౌండ్ల పాటు సాగిన బాక్సింగ్‌లో మొదటి నుంచి చివరి వరకు నీతూ సత్తా చాటింది. మూడు రౌండ్లలో ఇంగ్లీష్ బాక్సర్ కంటే న్యాయమూర్తులు నీతూకి ఎక్కువ పాయింట్లు ఇచ్చారు. దీంతో ఈ క్రీడల్లో భారత్‌ తరపున నీతూ 14వ స్వర్ణం సాధించింది. 
 
ఇంగ్లిష్ బాక్సర్‌తో నీతూ చేసిన పోరాటం మూడు రౌండ్ల పాటు అద్భుతంగా సాగింది. ఇద్దరి మధ్య దూకుడు తారాస్థాయికి చేరుకుంది. మూడు రౌండ్లలోనూ నీతూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి రౌండ్‌లో ఐదుగురు జడ్జిలలో నలుగురు నీతూకి 10 పాయింట్లు ఇచ్చారు. రెండు, మూడు రౌండ్లలో కూడా ఇదే విధమైన ఫలితాలు కనిపించాయి. ఫలితంగా చివరికి న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు భారత బాక్సర్ నీతూకు అనుకూలంగా వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments