Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామన్వెల్త్‌‌ క్రీడల్లో ఒకే రోజు మూడు స్వర్ణాలు

CWG
, శనివారం, 6 ఆగస్టు 2022 (11:39 IST)
కామన్వెల్త్‌‌ క్రీడల్లో ఒకే రోజు మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలు కైవసం చేసుకొని సత్తా చాటారు. భారత మల్ల యోధులు అద్భుత ప్రదర్శన చేశాడు. 
 
CWG
రెజ్లింగ్ పోటీలు మొదలైన తొలి రోజే మూడు స్వర్ణాలు బర్మింగ్ హామ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 65 కిలోల విభాగంలో స్టార్‌‌ రెజ్లర్‌‌, డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ బజ్‌‌రంగ్‌‌ పునియా, 86 కిలోల విభాగంలో దీపక్‌‌ పునియాతో పాటు మహిళల 62 కిలోల కేటగిరీలో సాక్షి మాలిక్‌‌ బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 57కిలోల విభాగంలో మరో భారత రెజ్లర్ అన్షు మాలిక్‌‌ రజత పతకంతో మెరిసింది. 
 
కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్‌లో ప్రతీసారి సత్తా చాటే రెజ్లు ఈ సారి కూడా అదే జోరు కొనసాగించారు. ఇక పురుషుల 86 కిలోల ఫైనల్లో దీపక్‌3–0తో మహ్మద్‌‌ ఇనామ్‌‌ (పాకిస్తాన్‌‌)ను ఓడించి ఈ క్రీడల్లో తొలి స్వర్ణం అందుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌‌లో నిరాశపర్చిన సాక్షి మాలిక్‌  కామన్వెల్త్ లో మాత్రం స్వర్ణ పట్టు పట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామన్వెల్త్ గేమ్స్‌లో చొక్కాపట్టుకున్న క్రీడాకారులు (video)