Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సింగ్ యాదవ్‌పై ఏంటి వివాదం.. వివరాలివ్వండి : రెజ్లింగ్‌ సమాఖ్యకు మోడీ ఆదేశం

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి చేరింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం కోరింది.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:46 IST)
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి చేరింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం కోరింది. రియో ఒలింపిక్స్ క్రీడా పోటీలకు ఎంపిక అయిన నర్సింగ్ యాదవ్ డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అది పెను వివాదమైన విషయం తెల్సిందే. దీనిపై మీడియా వరుస కథనాలు ప్రసారం చేయడంతో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 
 
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను వివరణ అడిగారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలను అందజేయాలని ఆయనను ఆదేశించారు. 74 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్‌కు నర్సింగ్ యాదవ్ ఎంపిక అయిన నాటి నుంచి అతని చుట్టూ వివాదం రాజుకుంటూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నర్సింగ్ డ్రగ్ టెస్టులో విఫలం కావడం పెను కలకలం రేపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments