Webdunia - Bharat's app for daily news and videos

Install App

మను భాకర్, సౌరభ్ చౌదరి అదుర్స్.. పసిడిని గెలుచుకునేశారు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (16:49 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత క్రీడాకారులు సౌరభ్ చౌదరి, మను భాకర్.. పసిడి పతకాన్ని సాధించారు. పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్‌లో భారత సౌరభ్, మను భాకర్ ద్వయం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.


ఫైనల్లో 778 స్కోరుతో 5.7 మార్జిన్‌తో భారత ద్వయం గెలుపును నమోదు చేసుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా, కొరియా, ఉక్రెయిన్ షూటర్ల నుంచి భారత్ గట్టిపోటీని ఎదుర్కొంది. 
 
అయితే ఫైనల్లో సౌరభ్ చౌదరి, మను భాకర్ ధీటుగా రాణించి పసిడిని గెలుచుకున్నారు. ఇప్పటికే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2019లో భారత్ ఇప్పటివరకు మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది.

అలాగే రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి రోజు ఆటలో అపూర్వి చందెలియా 10 మీటర్ల ఎయిర్ రిఫైల్ విభాగంలో పసిడిని కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments