Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌లో పతకాల పంట : మనీష్‌కు స్వర్ణం, సింఘరాజ్‌కు రజతం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:37 IST)
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో శనివారం భారత్‌కు వరసగా రెండు పతకాలు లభించాయి. షూటర్లు మనీష్ నర్వాల్, సింఘరాజ్ అదానాలు రెండు పతకాలు సాధించారు. 
 
ఈ పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన పురుషుల పి 4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్ 1 పోటీల్లో మనీష్ నర్వాల్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే, సింఘరాజ్ అదానా రజతపతకం సాధించారు.
 
దీంతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. మరోవైపు, ఇప్పటివరకు భారత్‌కు పారా ఒలింపిక్స్‌లో 15 పతకాలు భారత్ ఖాతాలో వచ్చిచేరాయి. 
 
మరోవైపు, 19 ఏళ్ల షూటర్ మనీష్ పారా ఒలింపిక్ రికార్డు సృష్టించాడు. మనీష్ బంగారు పతకం కైవసం చేసుకోవడానికి 218.2 పాయింట్లు సాధించాడు, సింఘరాజ్ 216.7 పాయింట్లతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో తన రెండో పతకాన్ని సాధించాడు. రష్యన్ పారాలింపిక్ కమిటీ సెర్గీ మలిషేవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments