Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ఓపెన్ సిరీస్: సెమీఫైనల్లో ఖంగుతిన్న సానియా మీర్జా జోడీ

చైనాలోని బీజింగ్‌లో జ‌రుగుతున్న చైనా ఓపెన్ సిరీస్‌లో భారత్‌కు చుక్కెదురైంది. ఈ టోర్నీ నుంచి భారత సానియా మీర్జా- షూయ్ పెంగ్ జోడీ నిష్క్రమించింది. ఈ టోర్నీ సెమీ ఫైన‌ల్స్‌లో భాగంగా జరిగిన సూప‌ర్ టై బ్రేక

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (17:10 IST)
చైనాలోని బీజింగ్‌లో జ‌రుగుతున్న చైనా ఓపెన్ సిరీస్‌లో భారత్‌కు చుక్కెదురైంది. ఈ టోర్నీ నుంచి భారత సానియా మీర్జా- షూయ్ పెంగ్ జోడీ నిష్క్రమించింది. ఈ టోర్నీ సెమీ ఫైన‌ల్స్‌లో భాగంగా జరిగిన సూప‌ర్ టై బ్రేక్‌లో స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్, తైవాన్‌కి చెందిన చాన్ యంగ్ జాన్‌ల జోడి చేతిలో సానియా జోడీ ఖంగుతింది. ఆద్యంతం ప్రత్యర్థి జోడీ పైచేయిగా నిలిచింది. ఫలితంగా 6-2, 1-6, 5-10 తేడాతో సానియా జంట పరాజయం పాలైంది.
 
గ‌త వారం వుహాన్‌లో జ‌రిగిన ఓపెన్ సిరీస్ సెమీ ఫైన‌ల్స్‌లోనూ సానియా మీర్జా జోడీ ఇదే మార్టినా హింగిస్ జోడీ చేతిలో ఓడిపోయింది. చైనా ఓపెన్ ఫైన‌ల్స్‌లో హింగిస్ - చాన్‌ల జోడి, తిమియా - ఆండ్రియా జోడీతో తలపడనుంది. మ‌రోవైపు సింగిల్స్‌లో సిమోనా హాలెప్ ఫైన‌ల్స్‌కి చేరుకుంది.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments