Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు చేరుకున్న పీవీ సింధు... ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపు

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:58 IST)
వరల్డ్ బ్యాడ్మింటన్ పోటి తుది ఫోరులో విశ్వవిజేతగా నిలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్ నగరానికి చేరుకుంది. తొలుత ఢిల్లీకి చేరుకున్న ఆమె మొదట కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా సింధును అభినందించిన రిజిజు, సింధు స్ఫూర్తితో మరింత మంది బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించాలని పిలుపునిచ్చారు.
 
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్న సింధు, అటునుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక్కడ ఆమెకు ఘనస్వాగతం పలుకనున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఆమెను గచ్చిబౌలి వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. 
 
అంతకుముందు ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 'ఓ భారతీయురాలిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇదో గొప్ప మెడల్. నాకు ప్రతి క్షణమూ సహకరించిన కోచ్‌కి కృతజ్ఞతలు' అని వ్యాఖ్యానించింది. 
 
కాగా, ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో గెలిచి, వరల్డ్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుని తొలి భారతీయురాలిగా సింధూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్‌కు చేరుకునే సింధూకు రాష్ట్ర బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌తో పాటు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

Rainfall: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన నివాస ప్రాంతాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments