Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు చేరుకున్న పీవీ సింధు... ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపు

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:58 IST)
వరల్డ్ బ్యాడ్మింటన్ పోటి తుది ఫోరులో విశ్వవిజేతగా నిలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్ నగరానికి చేరుకుంది. తొలుత ఢిల్లీకి చేరుకున్న ఆమె మొదట కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా సింధును అభినందించిన రిజిజు, సింధు స్ఫూర్తితో మరింత మంది బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించాలని పిలుపునిచ్చారు.
 
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్న సింధు, అటునుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక్కడ ఆమెకు ఘనస్వాగతం పలుకనున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఆమెను గచ్చిబౌలి వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. 
 
అంతకుముందు ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 'ఓ భారతీయురాలిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇదో గొప్ప మెడల్. నాకు ప్రతి క్షణమూ సహకరించిన కోచ్‌కి కృతజ్ఞతలు' అని వ్యాఖ్యానించింది. 
 
కాగా, ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో గెలిచి, వరల్డ్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుని తొలి భారతీయురాలిగా సింధూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్‌కు చేరుకునే సింధూకు రాష్ట్ర బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌తో పాటు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments