Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం కండువా కప్పుకున్న మల్లయోధురాలు

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:40 IST)
ప్రముఖ మల్లయోధురాలు (ఇంటర్నేషనల్ రెజ్లర్) బబితా ఫోగట్ కాషాయం జెండా కప్పుకున్నారు. గత కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం అందించిన ఈ క్రీడాకారిణి, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించి, ఆ తర్వాత బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. ఆమెతో పాటు.. ఆమె తండ్రి మహావీర్ ఫోగట్ కూడా బీజేపీలో చేరారు. 
 
మల్లవిద్యలో తన కుమార్తెలకు శిక్షణ ఇచ్చి వారిని విజయపథంలో నడిపిన మహావీర్ ఫొగట్ ప్రముఖ బాలీవుడ్ చిత్రం దంగల్‌కు స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ హర్యానా శాఖ ఇంచార్జి అనిల్ జైన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా సమక్షంలో వారు బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. 
 
కాగా, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి మోడీ చరిత్ర సృష్టించారని, ఆయనకు తాను వీరాభిమానినని బబిత చెప్పారు. కాశ్మీరీ వధువుల గురించి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న హర్యానా సీఎం ఖట్టర్‌కు ఆమె బాసటగా నిలిచారు. ఆయన ఎలాంటి తప్పుడు ప్రకటన చేయలేదన్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments