Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో రోజు వరుసగా లాభపడిన స్టాక్ మార్కెట్..

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (10:12 IST)
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ తొలుత 250 పాయింట్లు జంప్‌చేసింది. ప్రస్తుతం 217 పాయింట్లు బలపడి 38,745కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 60 పాయింట్లు ఎగసి 11,440 వద్ద ట్రేడవుతోంది. 
 
మంగళవారం అమెరికన్‌ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ఆసియాలో మార్కెట్లు ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను కైవసం చేసుకుంటున్నాయి. ఇంకా ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం, దేశీయంగా బలపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలు ఆర్జించాయి. 
 
ఇకపోతే.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ అత్యధికంగా 2.3 శాతం లాభపడగా... ఆటో, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ కాస్త పుంజుకున్నాయి. ఎస్‌బీఐ, హీరో మోటో, అదానీ పోర్ట్స్‌, ఇన్‌ప్రాటెల్‌, ఐసీఐసీఐ, గెయిల్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, జీ, ఐటీసీలు లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments