ఆరో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్-10వేల మార్కు వద్ద ముగిసిన నిఫ్టీ

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (16:08 IST)
బాంబే స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఆరవ రోజు లాభాల్లో ముగిసింది. సెనెక్స్‌ 284 పాయింట్ల లాభంతో 34,109.54 వద్ద, నిప్టీ 82 పాయింట్లు పెరిగి 10,061 పాయింట్ల ముగిసింది. లాక్‌డౌన్‌ సడలింపుతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతుందనే ఆశావహన అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. 
 
దేశీయ మార్కెట్లు లాభపడటంతో బ్యాంక్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్ల అండతో సూచీలు దూసుకెళ్లాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడంతో భారీ లాభాలకు అవకాశం లేకుండా పోయింది. నిఫ్టీ తిరిగి 10 వేల మార్కును అందుకుంది.
 
ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ఆద్యంతం లాభాలను ఆర్జించింది. ఒకానొక సమయంలో దాదాపు 600 పాయింట్లకు పైగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఇకపోతే.. నిఫ్టీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే షేర్లు ప్రధానంగా లాభాలు చవిచూశాయి. ఎన్టీపీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments