విఐపిలు ఆ ఒక్కరోజు తిరుమల రావద్దండి, ఎందుకంటే..?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (16:26 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను టిటిడి ప్రారంభించనుంది. తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో పలు సేవలను టిటిడి రద్దు చేస్తోంది. అంతే కాదు ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. 
 
అయితే ఈనెల 15వ తేదీన తిరుమలలో విఐపి బ్రేక్ దర్సనాలను రద్దు చేసింది టిటిడి. అక్టోబర్ 14వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 15వ తేదీ చక్రస్నానం కారనంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
ఈ కారణంగా గురువారం, అక్టోబర్ 15వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలను టిటిడి రద్దు చేసింది. అక్టోబర్ 14వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. కాబట్టి విఐపిలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టిటిడి విజ్ఞ చేస్తోంది.
 
ఇప్పటికే టిటిడి బ్రహ్మోత్సవాలకు ముందు విఐపి బ్రేక్ ఒకరోజు పాటు రద్దు చేసింది. ఈనెల 4వ తేదీన బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతున్న నేపథ్యంలో టిటిడి బ్రేక్ దర్సనాలను రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్ దర్సనాల రద్దు మామూలుగా జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

లేటెస్ట్

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

10-02-2026 మంగళవారం ఫలితాలు - ఆలోచించి ముందుకు సాగండి.. ఒత్తిళ్లకు గురికావద్దు...

తర్వాతి కథనం
Show comments