Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (20:05 IST)
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. మూడు రోజుల పాటు సాగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. కంకణ బట్టర్ గిరిధర్ ఆచార్యులు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంకణదారులైన ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు రోజుల పాటు గ్రామ పొలిమేర దాటకుండా నిష్టగా ఈ వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నారు.
 
ఏడాది పొడ‌వునా స్వామివారి ఉత్స‌వాలు, సేవ‌ల్లో జ‌రిగిన చిన్నపాటి దోషాలను నివారించి సంపూర్ణ ఫలాన్ని మాన‌వాళికి అందించేందుకు చేపట్టిన  పవిత్రోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించిన అర్చ‌క బృందానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 
ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, కుంభ సమారోపన, పవిత్ర విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments