Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశిపై టిటిడి తీసుకున్న నిర్ణయం భేష్ - కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (17:15 IST)
ఈనెల 25వ తేదీ ముక్కోటి ఏకాదశి సంధర్భంగా పది రోజుల పాటు భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్సనం కల్పించడం ఆనందదాయకమన్నారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. టిటిడి చేస్తున్న కార్యక్రమాల ద్వారా భక్తులకు మేలు కలగాలని కోరుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని ఈరోజు మధ్యాహ్నం కంచి పీఠాదిపతి దర్సించుకున్నారు. 
 
ఆలయం వద్ద టిటిడి ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో అనేక వ్రత, పూజాది ఉత్సవాలను భక్తుల సంక్షేమం కోసం టిటిడి నిర్వహిస్తుండడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్తీక మాసంలో దీపోత్సవం సందర్భంగా పీఠాధిపతులను టిటిడి ఆహ్వానం మేరకు తిరుమలకు వచ్చామన్నారు. 
 
కార్తీక మాసంలో భగవద్గీత, సుందరకాండ పారాయణం, విరాటపర్వం ప్రవచనాన్ని ప్రతినిత్యం మండపంలో శివకేశవ విశేష పూజాది కార్యక్రమాలు టిటిడి నిర్వహిస్తోందన్నారు. కరోనా కాలంలో కూడా తిరుమలలో లోక కళ్యాణార్థం, భక్తుల ఆరోగ్యార్థం టిటిడి ఎటువంటి లోటు లేకుండా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments