శ్రీవారి దర్శనం: క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి వుండాల్సిన పనిలేదు..

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (10:06 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండేందుకు మళ్లీ టైమ్ అలాట్‌మెంట్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఈ టిక్కెట్లు తిరుపతి బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గోవిందరాజ్ సత్రం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రోజూ 20వేల టిక్కెట్లు జారీ చేస్తారు. 
 
ఈ టికెట్ ఉన్న భక్తులు నిర్దేశిత సమయాల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ సమాచారం తెలియని భక్తులు తిరుమలకు వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. శని, ఆది సెలవులు కావడంతో భక్తులు సాధారణం కంటే ఎక్కువగా తరలివచ్చారు. 
 
రూ.300 టిక్కెట్లు ఉన్న భక్తులు గంటన్నరలో దర్శనం చేసుకుంటున్నారు. కాగా, తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితిని నివారించేందుకు వీలుగా సమయపాలన విధానాన్ని మళ్లీ తీసుకొచ్చామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్న తల్లిదండ్రులు.. 9వ ఫ్లోర్ నుంచి దూకేసిన అక్కా చెల్లెళ్లు

TGSRTC : బడ్జెట్-ఫ్రెండ్లీ గోవా టూర్ ప్యాకేజీని ప్రారంభించిన టీజీఎస్ఆర్టీసీ

నిద్రపోతున్నట్టు నటిస్తూ.. తోటి ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు.. దోషిగా తేల్చిన యూఎస్ కోర్టు

Bill Gates: ఫిబ్రవరి 18న అమరావతిని సందర్శించనున్న మైకోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

తర్వాతి కథనం
Show comments