శ్రీవారి దర్శనం: క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి వుండాల్సిన పనిలేదు..

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (10:06 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండేందుకు మళ్లీ టైమ్ అలాట్‌మెంట్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఈ టిక్కెట్లు తిరుపతి బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గోవిందరాజ్ సత్రం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రోజూ 20వేల టిక్కెట్లు జారీ చేస్తారు. 
 
ఈ టికెట్ ఉన్న భక్తులు నిర్దేశిత సమయాల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ సమాచారం తెలియని భక్తులు తిరుమలకు వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. శని, ఆది సెలవులు కావడంతో భక్తులు సాధారణం కంటే ఎక్కువగా తరలివచ్చారు. 
 
రూ.300 టిక్కెట్లు ఉన్న భక్తులు గంటన్నరలో దర్శనం చేసుకుంటున్నారు. కాగా, తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితిని నివారించేందుకు వీలుగా సమయపాలన విధానాన్ని మళ్లీ తీసుకొచ్చామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో అగ్రస్థానంలో పాకిస్థాన్

నిప్పుల కొలిమిగా తెలంగాణ - ప్రతాపం చూపుతున్న భానుడు

విద్యార్థినికి గర్భం చేసి అబార్షన్ చేయించిన ఉపాధ్యాయుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

చైత్రమాస అష్టమి.. దుర్గ, కాలభైరవ పూజతో విశేష ఫలితాలు..

09-04-2026 గురువారం ఫలితాలు - పోయానుకున్న వస్తువులు..?

చైత్ర సప్తమి రోజున ఇలా పూజిస్తే.. అన్నదానం, సూర్యపూజ చేస్తే..?

08-04-2026 బుధవారం ఫలితాలు- మాటతీరు అదుపులో ఉంచుకోండి

టీటీడీకి తలనొప్పి.. రూ.400 కోట్లకు పైగా పాత నోట్లు.. హుండీ ఆదాయంతో ఆర్థిక నష్టం

తర్వాతి కథనం
Show comments