Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం: క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి వుండాల్సిన పనిలేదు..

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (10:06 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండేందుకు మళ్లీ టైమ్ అలాట్‌మెంట్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఈ టిక్కెట్లు తిరుపతి బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గోవిందరాజ్ సత్రం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రోజూ 20వేల టిక్కెట్లు జారీ చేస్తారు. 
 
ఈ టికెట్ ఉన్న భక్తులు నిర్దేశిత సమయాల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ సమాచారం తెలియని భక్తులు తిరుమలకు వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. శని, ఆది సెలవులు కావడంతో భక్తులు సాధారణం కంటే ఎక్కువగా తరలివచ్చారు. 
 
రూ.300 టిక్కెట్లు ఉన్న భక్తులు గంటన్నరలో దర్శనం చేసుకుంటున్నారు. కాగా, తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితిని నివారించేందుకు వీలుగా సమయపాలన విధానాన్ని మళ్లీ తీసుకొచ్చామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

తర్వాతి కథనం
Show comments