Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం: క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి వుండాల్సిన పనిలేదు..

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (10:06 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండేందుకు మళ్లీ టైమ్ అలాట్‌మెంట్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఈ టిక్కెట్లు తిరుపతి బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గోవిందరాజ్ సత్రం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రోజూ 20వేల టిక్కెట్లు జారీ చేస్తారు. 
 
ఈ టికెట్ ఉన్న భక్తులు నిర్దేశిత సమయాల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ సమాచారం తెలియని భక్తులు తిరుమలకు వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. శని, ఆది సెలవులు కావడంతో భక్తులు సాధారణం కంటే ఎక్కువగా తరలివచ్చారు. 
 
రూ.300 టిక్కెట్లు ఉన్న భక్తులు గంటన్నరలో దర్శనం చేసుకుంటున్నారు. కాగా, తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితిని నివారించేందుకు వీలుగా సమయపాలన విధానాన్ని మళ్లీ తీసుకొచ్చామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

అన్నీ చూడండి

లేటెస్ట్

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

తర్వాతి కథనం
Show comments