శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు సిద్ధం చేసిన తితిదే - తొలి 3 రోజులు వారికే..

Webdunia
గురువారం, 14 మే 2020 (16:02 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఫలితంగా గత 50 రోజులకు పైగా తిరుమల కొండపైకి భక్తులు ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. కేవలం తిరుమల గిరిపై నివాసిస్తున్న ఉద్యోగులు, తితిదే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17వ తేదీన లాక్డౌన్ ఎత్తివేసిన పక్షంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. 
 
వీటిలోభాగంగా, తొలి మూడు రోజుల పాటు కేవలం తితిదే సిబ్బందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తిరుపతి, తిరుమల ప్రజలకు 15 రోజుల పాటు దర్శనం అందుబాటులోకి తెస్తారు. అదీకూడా ప్రయోగాత్మకంగా ఈ దర్శనం కల్పించనున్నారు.
 
అంతేకాకుండా, రోజుకు కేవలం 14 గంటల పాటు కేవలం 500 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ లెక్కన వారానికి 7 వేలు మంది మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఇతర భక్తుల కోసం దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విక్రయించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pod Taxis: హైదరాబాద్ నగరంలో కొత్త ట్రాన్స్‌పోర్ట్.. పాడ్ టాక్సీలు వచ్చేస్తున్నాయ్

నా ఇల్లు.. నా ఇల్లూ కూలగొట్టొద్దు, 10 నిమిషాలయినా చూసుకోనివ్వండి: బాధిత మహిళ వేడుకోలు

ఖమ్మం - దేవరపల్లి మధ్య సిద్ధమైన తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే

యువ జంటను బెదిరించిన బెంగుళూరు స్లీపర్ బస్సు కండక్టర్ - ట్వీట్ వైరల్

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థుల కోసం 90 అదనపు బస్సులు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...

22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Lunar Eclipse: మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..

21-02-2026 శనివారం ఫలితాలు : నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments