Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల గిరులను నిర్మానుష్యం చేయం : తితిదే ఛైర్మన్ సుధాకర్

తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆలయంలో వచ్చేనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహాసంప్రోక్షణం కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ మహాఘట్టం సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనాన

Webdunia
ఆదివారం, 15 జులై 2018 (15:56 IST)
తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆలయంలో వచ్చేనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహాసంప్రోక్షణం కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ మహాఘట్టం సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నారు.
 
నిజానికి స్వామి దర్శనం పూర్తిగా నిలిపేయాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ, తొలుత నడక మార్గాలను మూసివేయాలని భావించింది. ఇలా చేయడం వల్ల తిరుమల పూర్తిగా నిర్మానుష్యంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. తిరుమల గిరులను చూసేందుకు వచ్చే భక్తులు ఇతర ఆలయాలు, పవిత్ర ప్రదేశాలను దర్శించుకుని వెళ్లే అవకాశాన్ని కల్పించనుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, యాత్రికులను, భక్తులను అడ్డుకోబోమని, అయితే, స్వామి దర్శనం మాత్రం లభించదని తెలిపారు. ఇదే విషయంపై తిరుపతి, అలిపిరిలో కరపత్రాలను పంచి పెడతామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులపై ఎలాంటి ఆంక్షలూ ఉండవన్నారు. మహా సంప్రోక్షణం జరిగే రోజుల్లో సుప్రభాత సేవ ఏకాంతంగా ఉంటుందని, మిగతా అన్ని ఆర్జిత సేవలూ రద్దు చేశామని, సాధారణ భక్తులతో పాటు... వీఐపీ దర్శనాలకు కూడా నిలిపివేసినట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments