శ్రీవారి ప్రసాదం ధర పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే (Video)

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (13:10 IST)
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ ధర పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెనక్కి తగ్గింది. శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ధరను పెంచబోవడం లేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 
 
ఆయన ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని చెన్నైకు శనివారం తిరిగివచ్చారు. ఆయన్ను చెన్నైలోని ప్రముఖ సామాజిక సేవా సంస్థ ఉంగలుక్కాక చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్‌ సాదరస్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లడ్డూ ధరను సవరించడం లేదని, ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలోనే లడ్డూల విక్రయాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, గత వారంలో టీటీడీ అధికారులు సమావేశమై, ప్రస్తుతం రూ.25గా ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద లిద్ధు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

కర్నాటక సీఎం సిద్ధు రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ఒంటరి మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు యుద్ధం.. యూస్ వార్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments