Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ రూ.200, వడ ధర రూ.100గా పెంపు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత వుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తే లడ్డూ తీసుకోకుండా భక్తులు కొండ దిగరు. అలాంటి లడ్డూ ధరలు పెరగనున్నాయి. అయితే దర్శనం టికెట్‌

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (13:47 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత వుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తే లడ్డూ తీసుకోకుండా భక్తులు కొండ దిగరు. అలాంటి లడ్డూ ధరలు పెరగనున్నాయి. అయితే దర్శనం టికెట్‌పై పొందే లడ్డూల ధరలు యధాతథంగా వుంటాయని.. సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లోనూ ఎలాంటి మార్పు వుండదని టీటీడీ తెలిపింది.
 
ఇక సర్వదర్శనం, దివ్యదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి రాయితీ పద్ధతిలో టీటీడీ లడ్డూలను అందజేస్తూ వుంటుంది. రాయితీ లడ్డూలు కాకుండా ఎక్కువ లడ్డూలు కావాలంటే కొంచెం ఎక్కువగా చెల్లించాల్సి వుంటుంది. 
 
కొందరు ఎక్కువ మొత్తంలో లడ్డూలు కొనుగోలు చేయడానికి సిఫార్సు లేఖలు సైతం ఇస్తుంటారు. అలాంటి సిఫార్సు లేఖలపై జారీచేసే లడ్డూల ధరలను పెంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100గా టీటీడీ రేటును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు ఈ నెల 25వ తేదీ నుంచి పెరిగే ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

బ్యాంకాక్ భూకంపం నుంచి తప్పించుకుని ప్రాణాలతో తిరిగొచ్చిన ఎమ్మెల్యే ఫ్యామిలీ!

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments