Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుకొండలవాడా గోవిందా గోవిందా, బ్రహ్మోత్సవాలు ఆ తేదీల్లోనే...

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (19:37 IST)
కలియుగ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తేదీని ఖరారు చేశారు. బ్రహ్మోత్సవాలు ఏవిధంగా నిర్వహిస్తారు.. అసలు గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అదే తేదీల్లో జరుగుతుందా లేదా అన్న అనుమానం కోట్లాదిమంది భక్తుల్లో ఉండేది.
 
అయితే వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టిటిడి. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీన అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.
 
బ్రహ్మోత్సవాల్లో విశేషమైన రోజుల వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన ధ్వజారోహణం, సెప్టెంబర్ 23వ తేదీన గరుడసేవ, సెప్టెంబర్ 24వ తేదీన స్వర్ణరథోత్సవం, సెప్టెంబర్ 26వ తేదీన రథోత్సవం, సెప్టెంబర్ 27వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి.
 
అయితే బ్రహ్మోత్సవాలను ఎలా నిర్వహించాలి అనే విషయంపై టిటిడి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలా.. లేక పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి నిర్వహించాలా అన్న ఆలోచనలో టిటిడి ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నెల చివరకి టిటిడికి సంబంధించిన పాలకమండలి సమావేశంలో టిటిడి అధికారులు ఇందుకు సంబంధించిన అధికారులు ఒక నిర్ణయం తీసేసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

పవన్ కుమారుడు మార్క్ స్కూలులో అగ్ని ప్రమాదం.. వారికి సత్కారం

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

తర్వాతి కథనం
Show comments