Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం తలుపులు.. నేటి నుంచి మాస పూజలు

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (10:56 IST)
కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా మూతపడివున్న శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్ర ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. మాస పూజల కోసం ఈ ఆలయాన్ని తెరిచారు. దీంతో చింగం మాస పూజ‌లు అయిదు రోజులు నిర్వ‌హించ‌నున్నారు. 
 
ఈ పూజలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే కోవిడ్‌19 నిబంధ‌న‌లు ఉన్న నేప‌థ్యంలో.. భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదు. ఆల‌యాన్ని ఈనెల 21వ తేదీన మూసివేస్తారు. మ‌ల‌యాళం కొత్త సంవ‌త్స‌ర దినం సంద‌ర్భంగా ఆగ‌స్టు 17వ తేదీ నుంచి అన్ని అయ్య‌ప్ప ఆల‌యాల‌ను తెర‌వాల‌ని ట్రావెన్‌కోర్ దేవ‌స్థాన బోర్డు నిర్ణ‌యించింది. 
 
ద‌క్షిణ భార‌త దేశంలో ఆ బోర్డు కింద సుమారు వెయ్యి ఆల‌యాలు ఉన్నాయి. మ‌ళ్లీ ఓన‌మ్ పూజ కోసం ఆగ‌స్టు 29వ తేదీన శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. సెప్టెంబ‌రు రెండ‌వ తేదీ వ‌ర‌కు ఆల‌యం తెరిచి ఉంటుందని టీడీబీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. న‌వంబ‌ర్ 16వ తేదీన శబ‌రిమ‌ల వార్షిక ఉత్స‌వాలు మొద‌లు అవుతాయ‌ని బోర్డు అధ్య‌క్షుడు ఎన్ వాసు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య నాడు జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments