Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ లడ్డూల విక్రయం!

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు శుభవార్త చెప్పింది. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలను ఇకపై ఆన్‌లైన్‌లోనూ విక్రయించాలని నిర్ణయించింది. అంటే.. తిరుమల వెంకన్న లడ్డూలు కావాలనుకునేవారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకంటే.. సమీపంలోని తితిదే సమాచార కేంద్రాలు, తితిదే కళ్యాణ మండపాల్లో తీసుకోవచ్చు. 
 
శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ అందిచాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నారు. రూ.25కే రాయితీ లడ్డూలను అన్ని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో విక్రయిస్తున్నారు. అటు ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు ఎంత మొత్తంలో కావాలన్నా.. పంపిణీ చేస్తామని టీటీడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
ఈ ప్రత్యేక ఆర్డర్ లడ్డూలకు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఇకపై లడ్డూలను ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు జరపాలని టీటీడీ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో లడ్డూలు ఆర్డర్ చేసేవాళ్లు.. వాటిని తమకు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాల నుంచి సేకరించే సదుపాయాన్ని కల్పించింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments